సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 861 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మే 9వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024, ఏప్రిల్ 10వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం secr.indianrailways.gov.in వెబ్సైట్ను సందర్శించండి.