ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి: సీఈసీ రాజీవ్ కుమార్

73చూసినవారు
ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి: సీఈసీ రాజీవ్ కుమార్
దేశంలో ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, ఈ ఎన్నికల్లో 64.2 కోట్లమంది ఓట్లు వేశారని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈసారి ఎన్నికల్లో జరిగిన పోలింగ్ ప్రపంచ చరిత్రలోనే ఓ రికార్డు. ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్