‘నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’

85చూసినవారు
‘నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’
మదురై లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్‌ శరవణన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి సెల్లూరు కె.రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎందుకురా బాబూ ఈ మీటింగ్‌లో కూర్చొబెట్టారు అనుకొని లేచేందుకు ఎవ్వరూ ప్రయత్నించవద్దు. అందురూ కూర్చొనే ఉండాలి.. ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత పోస్ట్