అన్నమయ్య జిల్లాలో దారుణం.. అందరూ చూస్తుండగా దారుణ హత్య

575చూసినవారు
అన్నమయ్య జిల్లాలో దారుణం.. అందరూ చూస్తుండగా దారుణ హత్య
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి లో దారుణ హత్య జరిగింది. స్థానిక ఇండియన్ బ్యాంక్ వెనుక వున్న ఫాతీమా మసీదులో అతి దారుణంగా తోడల్లుడు మయాన ఇంతియాజ్ అలీ ఖాన్ పై కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. నమాజ్ ప్రార్థనలో వున్న ఇంతియాజ్ పై అందరూ చూస్తుండగా పిడిబాకు కత్తితో పొడిచి దారుణంగా చంపాడని తెలుస్తోంది. ఈ మేరకు ఇంతియాజ్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్