93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్

80చూసినవారు
93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 1300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 120 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తంగా 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు.