ఒకే కాన్పులో ఐదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

63చూసినవారు
ఒకే కాన్పులో ఐదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన మహిళ
బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. అయిదుగురు శిశువులూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కిషన్‌గంజ్‌ జిల్లాలోని ఠాకుర్‌గంజ్‌కు చెందిన తాహీరా బేగం గర్భంలో అయిదుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు ముందే గుర్తించారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఠాకుర్‌గంజ్‌ కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు సురక్షితంగా ప్రసవం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్