అండర్-19 ప్రపంచకప్లో అంతిమ సమరానికి వేళైంది. ఆదివారం బెనోనిలో విల్లోమూర్ పార్క్లో జరిగే ఫైనల్ మ్యాచులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమ్ఇండియా ఫైనల్కు చేరుకోవడం ఇది తొమ్మిదో సారి. వరుసగా ఐదోసారి. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఫైనల్ మ్యాచులు ఆడగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది.