దేశంలో లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలకు ముందు ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. వారం క్రితం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బీజేపీ టార్గెట్గా కొందరు ట్రోలర్స్ వీడియోలు చేస్తున్నారు. ఈడీ వస్తే బీజేపీలో చేరిపోయాను అంటూ కాషాయ కండువా కప్పుకుంటే ఈడీ అధికారులు వదిలేస్తారనే కాన్సెప్ట్తో ఓ వీడియో వైరల్ అవుతుంది.