ఇజ్రాయెల్‌ దాడులో ముగ్గురు జర్నలిస్టులు మృతి

77చూసినవారు
ఇజ్రాయెల్‌ దాడులో ముగ్గురు జర్నలిస్టులు మృతి
లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులో ముగ్గురు జర్నలిస్టులు చనిపోయారు. వారు బీరుట్ కేంద్రంగా పని చేసే అరబ్ టీవీ ఛానెల్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు గాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 38 మంది చనిపోయారు.

సంబంధిత పోస్ట్