కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి

65చూసినవారు
కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి
ఒడిశాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. కోరాపూట్ జిల్లాలోని సల్మాన్ గూడ గ్రామానికి చెందిన 10 మంది కూలీలు కోలాబ్ డ్యాం సమీపంలో మతిఖాల ముర్రం కొండ వద్ద మట్టి తవ్వేందుకు కొండపైకి వెళ్లారు. ఈ క్రమంలో కొంత భూమి కిందకు కుంగడంతో, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. మృతులు పూర్ణి జానీ(17), సన్మతి జానీ(18), చంపా బద్నాయక్‌(18)గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్