పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ ప్రాంతంలో తాజాగా దారుణం జరిగింది.. ఓ ముస్లిం వ్యక్తిపై కొందరు విచక్షణా రహితంగా దాడి చేశారు. హిందూ దేవాలయం సమీపంలో మాంసం పడేశాడని అతడిపై ఆరోపణలు చేశారు. స్తంభానికి కట్టి, గంట పాటు చిత్రహింసలు పెట్టారు. కర్రలతో కనికరం లేకుండా కొట్టారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. దాడి వీడియో వైరల్ అవుతోంది.