తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం

59చూసినవారు
తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం
వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది.