నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
అనంతసాగరం మండలం లక్కరాజుపల
్లికి చెందిన విష్ణువర్దన్ రెడ్డి అనే యువకుడు సచివాలయ సర్వేయర్గా పని చేస్తున్నాడు. అతడికి 10 రోజుల క్రితమే పెళ్లయింది. పొలంలో మోటార్ రిపేర్ చేస్తున్న విష్ణువర్దన్కు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వి
డిచాడు. పెళ్లయిన పది రోజులకే విష్ణువర్దన్ చనిపోవడం స్థానికంగా కలచివేసింది. ఆ పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.