విషాదం.. వారసుడిని ఇవ్వలేనంటూ గర్భిణి ఆత్మహత్య

56చూసినవారు
విషాదం.. వారసుడిని ఇవ్వలేనంటూ గర్భిణి ఆత్మహత్య
ఏపీలో దారుణ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో ఐదు నెలల గర్భిణి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే గ్రామంలో నివాసం ఉండే శ్రీకాంత్ భార్య కావ్య ఐదు నెలల గర్భిణి. వీరికి కుమార్తె కూడా ఉంది. కావ్య గర్భిణి కావడంతో మగబిడ్డ కావాలంటూ భర్త వేధింపులకు గురిచేశారు. మనస్థాపం చెందిన భార్య.. వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ్ పెట్టి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్