రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్‌

63చూసినవారు
రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్‌
ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్‌ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్‌ మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని తెలిపారు. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని, దర్యాప్తు ప్రారంభమైందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్