ఎయిర్పోర్టుల్లోని పటిష్ఠ భద్రతను దాటుకుని మరీ విమానాల్లో తోటి ప్రయాణికుల వస్తువులను ఓ దొంగ చోరీ చేయడం చర్చనీయాంశమైంది. రాజేశ్ కపూర్ అనే ఈ దొంగ 2023లో 100 రోజుల్లో 200 విమానాల్లో చోరీలు చేశాడు. కనెక్టింగ్ ఫ్లైట్స్లో ప్రయాణించే సీనియర్లు, మహిళలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తానని పోలీసుల విచారణలో తెలిపాడు. గతంలో రైళ్లలో చోరీలు చేసిన రాజేశ్ పోలీసులకు పట్టుబడ్డాక రూట్ మార్చాడు.