TG: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉండటంతో 14వ కి.మీ వరకు నడుచుకుంటూ వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది.