బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం నితీష్ కుమార్ మహాకూటమితో తెగదెంపులు చేసుకుని తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బిహార్
బీజేపీ శాసన సభాపక్షం సమావేశమై చర్చలు జరిపింది. జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు
బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే తెలిపారు.