రాహుల్ గాంధీపై అసోం సీఎం మరోసారి విమర్శలు

52చూసినవారు
రాహుల్ గాంధీపై అసోం సీఎం మరోసారి విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఆదివారం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలో బయటపెడతా. కొన్ని రోజులు ఆగండి. ఈ రోజు దిబ్రూగఢ్, సోమవారం గువహటిలో పర్యటనలు ఉన్నాయి. తిరిగి వచ్చాక రాహుల్ డూప్ వివరాలన్ని చెబుతా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్