మంగళగిరిలో
వైసీపీ కనుమరుగైందని
టీడీపీ నేత నారా
లోకేశ్ అన్నారు. నియోజకవర్గమంతా ఇప్పుడు పసుపుమయమై
టీడీపీ కంచుకోటగా మారిందని చెప్పారు. 72 రోజుల్లో రాష్ట్రమంతా పసుపుమయం కాబోతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.