దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ టన్నెల్ మెట్రో రైలు సేవలు కోల్కతాలో శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. హావ్డా మైదాన్ స్టేషన్ నుంచి ఎస్ప్లనేడ్కు అలాగే ఎస్ప్లనేడ్ నుంచి హావ్డా మైదాన్కు ఒకేసారి మెట్రో రైళ్లు బయల్దేరాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య రూ.4,965 కోట్లతో భూగర్భంలో మెట్రో మార్గం నిర్మించారు. అందులో 520 మీటర్లు హుగ్లీ నదిలోని సొరంగం గుండా మెట్రో ప్రయాణిస్తుంది. తొలి రోజే ప్రజలు భారీగా తరలివచ్చారు.