విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

65చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే అంశం తెర మీదకు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడంతోనే ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోందని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్