అకాల వర్షాలు.. 13 మంది మృతి

16835చూసినవారు
అకాల వర్షాలు.. 13 మంది మృతి
తెలంగాణలో నిన్న ఈదురుగాలులు, అకాల వర్షాల ధాటికి వేర్వేరు చోట్ల 13 మంది మృతి చెందారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోగా, హైదరాబాద్ లో నలుగురు, మెదక్ లో ఇద్దరు మరణించారు. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. జగిత్యాలలోని జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్