ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

64చూసినవారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్స్ ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్