ఓయో రూమ్‌లో టీచర్ అనుమానాస్పద మృతి

60చూసినవారు
ఓయో రూమ్‌లో టీచర్ అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీకి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసముంటున్న జయప్రకాష్ నారాయణ ఏపీలోని రాయచోటిలో టీచర్‌గా విధులు నిర్వహిస్తూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. రాయచోటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి మియాపూర్‌లో ఓయో రూమ్‌కు వెళ్లాడు. అక్కడ విషం మాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్