భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వేదికగా 2024 జూన్ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. UPI యాప్స్లో ఫోన్పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.