మంగళగిరిలో మూడేళ్ల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. కేసులో భాగంగా కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను సేకరించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగితా వారి కోసం గాలిస్తున్నారు.