AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండులో ఉన్నారు.