మహారాష్ట్ర థానె జిల్లా ముర్బాద్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విధుల్లో భాగంగా లైన్మెన్ కమలాకర్ భోయిర్ (53) విద్యుత్ స్తంభం ఎక్కాడు. స్తంభంపై ఆగిపోయిన విద్యుత్ దీపాన్ని సరి చేసి స్విచ్ ఆన్ చేశాడు. ఆ సమయంలో కమలాకర్కు కరెంట్ షాక్ తగిలింది. దీంతో స్తంభం పై నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.