2024 సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కొరత కారణంగానే
బీజేపీ జమిలి ఎన్నికలపై మాట్లాడడం లేదని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. హర్యానాలో గెలిచిన తర్వాత మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చామన్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే ఏకకాలంలో
ఎన్నికలు నిర్వహించాలని, అలా కాకుండా జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి మరిన్ని చోట్ల ప్రచారం నిర్వహించడం సరికాదన్నారు.