చిరుత దాడిలో దూడ మృతి

53చూసినవారు
చిరుత దాడిలో దూడ మృతి
ఉమ్మడి మద్దూరు మండలం గోర్లోనిబావి గ్రామానికి చెందిన కావలి అంజిలయ్యకు చెందిన లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం. భూనీడు గ్రామ శివారులోని పొలం దగ్గర పశువులను కట్టివేసి ఇంటికి వెళ్ళిన రైతు ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా లేగ దూడపై చిరుత దాడి చేసినట్లు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :