ఇంటర్ స్టేట్ టాపర్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పట్నం

75చూసినవారు
ఇంటర్ స్టేట్ టాపర్ ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పట్నం
కొడంగల్ కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలకు చెందిన అనూష ఇంటర్మీడియట్ ఎంపీసీ తెలుగు మీడియం ద్వితీయ సంవత్సరంలో 988 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో రాజారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్