ఇద్దరు మిత్రుల ఆలోచన.. ప్రజల వద్దకు వైద్యం

577చూసినవారు
మద్దూరు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో ఎపిక్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య వాహిని మొబైల్ క్లినిక్ ను జనరల్ మేనేజర్ నర్సింలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య వాహిని చల్ల సురేష్, సాయి ప్రతాప్ అనే ఇద్దరు మిత్రుల ఆలోచనతో రూపొందిందన్నారు. జిల్లా కలెక్టర్ ఈ మొబైల్ క్లినిక్ సహకారం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేదే వీరి ముఖ్య ఉద్దేశం అన్నారు.

ట్యాగ్స్ :