భూనీడులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఉమ్మడి మద్దూర్ మండలం భూనీడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 విద్య సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు కలుసుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.