పరిగి నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్, గండీడ్ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం ప్రజా ఆశీర్వాద సభలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిరుపేదల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.