వికారాబాద్: సమస్యలు వెంటనే పరిష్కరించాలి

79చూసినవారు
వికారాబాద్: సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి 115 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో భూ సంబంధిత, ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయన్నారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్