శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ మాజీ జెడ్పిటిసి ముత్తార్ షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని బూరుగుపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.