కంట్రీ మేడ్ గన్ తో రీల్స్.. బుల్లెట్ తగిలి డిగ్రీ విద్యార్థి మృతి

58చూసినవారు
కంట్రీ మేడ్ గన్ తో రీల్స్.. బుల్లెట్ తగిలి డిగ్రీ విద్యార్థి మృతి
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చాలామంది ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్లోని కోటాలో జరిగింది. స్థానికంగా ఉంటున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థి తన స్నేహితులతో కలిసి కంట్రీ మేడ్ గన్ తో రీల్స్ చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బుల్లెట్ అతని ఛాతీకి తగిలింది. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్