ఉపాధ్యాయులకు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదని మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల చారు, మెత్తగా ఉడికిన అన్నం తినలేక పోతున్నామని, వంటవారిని అడిగితే బిల్లులు రావడం లేదు మేమేం చేయాలని అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెనూ ప్రకారం భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.