Jan 31, 2025, 13:01 IST/
TG: తల్లి మృతి.. వారం రోజులుగా మృతదేహంతో కూతుళ్లు
Jan 31, 2025, 13:01 IST
సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో మృతదేహంతో కూతుళ్లు ఇంట్లో వారం రోజులుగా ఉంటున్నారు. దహన సంస్కారాలకు డబ్బుల్లేక మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా.. ఒక రూమ్లో తల్లి మృతదేహం ఉంచి మరో రూమ్లో ఉంటున్నామని కూతుళ్ళు జవాబిచ్చారు. పోస్ట్ మార్టం కోసం డెడ్బాడీని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.