గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు
భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు చేశారు. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అందిన సమాచారం మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్ సిబ్బంది దాడులు నిర్వహించారు. 9 ప్రాంతాల్లో 6600 చక్కర ద్రావకాన్ని ధ్వంసం చేశారు. 220 లీటర్ల గుడుంబాను స్వాధీనపరచుకొని ముగ్గురు పై కేసులు నమోదు చేశారు.