ట్రాక్టర్ బోల్తా ఐదుగురికి గాయాలు

60చూసినవారు
ట్రాక్టర్ బోల్తా ఐదుగురికి గాయాలు
జయశంకర్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామం వద్ద పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై సోమవారం సెంట్రింగ్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. వీరిని ములుగు ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. గాయాలైన వారంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో మహంకాళి 39, ఇసాక్ 28, బాబూరావు 29, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్