భూవివాదంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

53చూసినవారు
భూవివాదంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి మధ్య భూ వివాదం ఉన్నది. తిరుపతి రెడ్డి తనకున్న భూమిలో మిరప పంట వేయగా దానిని ప్రభాకర్ రెడ్డి ధ్వంసం చేశాడనే అనుమానంతో అతనితో గొడవపడ్డాడు. ఇదే విషయం మనసులో పెట్టుకొని మనస్తాపం చెందిన తిరుపతి రెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఎస్సై పవన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్