
భారీగా పెరిగిన బంగారం ధరలు
గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,100 పెరిగి రూ.87,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,200 పెరిగి రూ.95,130కి చేరింది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,08,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.