విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

1343చూసినవారు
విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి
ప్రమాదవశాత్తు బోరు మోటర్ వైరు తగిలి విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కామెడీ మహిపాల్ రెడ్డి( 25 ) తనకు గల వ్యవసాయ బావి వద్ద బోరు మోటర్ లోని మోటర్ ను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మోటార్ కు గల కాపర్ వైర్ తేలడంతో గమనించని రైతు అట్టి వైర్ కు తాను మోటార్ ను పైకి లేపడానికి తీసుకువచ్చిన ఇనుప రాడ్ కు తగలడంతో విద్యుత్ వైర్లు తగిలి షాకు వచ్చి మృతి చెందారని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటనతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్