Jan 28, 2025, 10:01 IST/
ఏపీ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థత
Jan 28, 2025, 10:01 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.