ములుగు జిల్లా కేంద్రంలో ప్రజలు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు వారిలో నమ్మకం కలిగేలా ములుగు జిల్లా పోలీస్, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు శుక్రవారం సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ చేపట్టాయి. జిల్లా ఎస్పీ శభరీష్ మాట్లాడుతూ. ప్రజల్లో ఎన్నికల పట్ల విశ్వాసం కలిగేలా జిల్లా పోలీస్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఓటర్లు ప్రలోభాలకు గురి కావొద్దని, నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.