బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామం నుండి 15 కుటుంబాలు బిఆర్ఎస్, బీజేపీకి రాజీనామ చేసి యువజన నాయకులు డ్యాగల కృష్ణ (రాజేష్), గ్రామ పార్టీ అధ్యక్షులు బోయిని రాజు ఆధ్వర్యంలో సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.