ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి పోతే ప్రాణమే పోయింది!

56చూసినవారు
ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి పోతే ప్రాణమే పోయింది!
ఏపీలోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములకలాపల్లిలో విద్యుదాఘాతానికి గురై విద్యార్థి దుర్మరణం చెందాడు. గణేష్, భవాని దంపతుల రెండో కుమారుడైన వడిగండ యశ్వంత్ (11) నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి ప్రయత్నించిన యశ్వంత్ షాక్‌కు మృతి చెందాడు. చూస్తుండగానే కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్