సీతారాంనాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మండల సీనియర్ నాయకుడు లింగబత్తుల యాకసాయన్న అన్నారు. శనివారం ధర్మరావుపేటలో సీతారాం నాయక్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు గెలిపించాలన్నారు.